వైఎస్ జగన్ ఫ్యామిలీ జాగ్రత్తగా ఉండాలి : చింతమనేనని
ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై రాయి దాడి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో జగన్ నటిస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో బాబాయ్ గొడ్డలిపోటుతో సానుభూతి పెంచుకున్నారు. ఇప్పుడు గులకరాయి డ్రామా విఫలమవడంతో ఎవరైనా బలికావొచ్చు. విజయమ్మ ముందు జాగ్రత్తగా అమెరికా వెళ్లారని ప్రజలు అనుకుంటున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా జైలులోనే ఉంటా, బయటకు రానంటున్నారు అని అన్నారు.
Tags :