చూడు బాబు చూడు.. జగన్ సినిమా సెట్టింగ్ చూడు..
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తాను స్వయంగా పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు అక్కడ జరిగిన సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు జగన్ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. తాను ఇచ్చిన హామీలలో కనీసం 10 శాతం కూడా నిలబెట్టుకోవడంలో జగన్ వైఫల్యం అయ్యాడు అని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమరావతిని రాజధానిగా ప్రకటిస్తామని చంద్రబాబు అన్నారు. అంతేకాదు పులివెందులలో జగన్ కంటే అభివృద్ధి ఎక్కువగా చేసింది తానేనని చంద్రబాబు పేర్కొన్నారు. సినిమా సెట్టింగులు వేసి జనాలను మోసం చేసిన ముఖ్యమంత్రిగా జగన్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాడని చంద్రబాబు అన్నారు. యువతకు ఉద్యోగా, ఉపాధి అవకాశాలు కలిగించే దిశగా తమ ప్రభుత్వం పని చేస్తుంది అని చంద్రబాబు పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్ల తమ పాలనలో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంతవరకు నెలకు 3000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.