కేంద్రం హైఅలర్ట్ ...అన్ని రాష్ట్రాలకు హెచ్చరిక
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో హైఅలర్ట్ ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కరోనా అలర్ట్ జారీ చేసింది. కేసులు పెరుగుతుండంతో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో కేసులు పెరుగుతున్న వేళ ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏప్రిల్ 10, 11వ తేదీల్లో కరోనా పై కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహించనుంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
Tags :