సెంట్రల్ బ్యాంక్ ఆఫర్.. మార్చి 31 వరకు పొడిగింపు
రిటైల్ రుణాలకు డిమాండు పెరుగుతున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఫెస్టివల్ ఆఫర్ను మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఫెస్టివల్ ఆఫర్ కింద వివిధ రుణాలపై కస్టమర్లకు తక్కువ వడ్డీరేటు, ప్రాసెసింగ్ ఫీజు ఎత్తివేత, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్టు బ్యాంకు జనరల్ మేనేజర్ వివేక్ కుమార్ ప్రకటించారు. సెంట్ గృహలక్ష్మి, సెంట్ బిజినెస్ స్కీమ్ల కింద 8.35 శాతం నుంచి ప్రారంభించి తక్కువ వడ్డీకే రుణాలందిస్తున్నట్టు తెలిపారు.
Tags :