కేంద్ర ప్రభుత్వం శుభవార్త
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2023-24 ఖరీఫ్ సీజన్కు గాను పలు రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు తెలిపారు. క్వింటాల్ సాధారణ వరికి మద్దతు ధరను రూ.143 చొప్పున పెంచినట్లు వెల్లడించారు. దీంతో క్వింటాల్ సాధారణ వరి రకం ధర రూ.2,183కి చేరింది. అలాగే, గ్రేడ్`ఎ వరికి రూ.163 లు పెంచడంతో క్వింటాల్ ధర రూ.2203కి పెరిగిందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కనీస మద్దతు ధర అధికంగా పెంచినట్టు తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన తరుణంలో ఎంఎస్పీ పెంచడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
Tags :