సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఖరారు
సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత పద్మారావు గౌడ్ను బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంపిక చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకుల అభిప్రాయం మేరకు సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు పేరును ఖరారు చేశారు. ఇప్పటి వరకు 14 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి, నల్గొండ, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది.
Tags :