ఆస్ట్రేలియాలో మలబార్ గోల్డ్ షోరూం ప్రారంభం
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో తొలి షోరూంను ఏర్పాటు చేసింది. మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ బ్రెట్లీ కొత్త షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. తద్వారా ఆస్ట్రేలియాలో షోరూంను ఆవిష్కరించిన తొలి భారత జ్యువెలరీ బ్రాండ్గా చరిత్ర సృష్టిచింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య బలమైన ఆర్థిక, ద్వైపాక్షిక వాణిజ్య బంధానికి ఇది తార్కాణం. ఆసీస్ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన పెట్టుబడులు, స్థానికంగా ఉద్యోగ కల్పన లక్ష్యంగా మా వృద్ధి ప్రణాళిక రూపొందించాము అని సంస్థ చైర్మన్ ఎం.పీ.అహ్మద్ తెలిపారు. మలబార్ ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో 340 షోరూంల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
Tags :