ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రాజ్యసభలో మరో వివాదాస్పద బిల్లు ... ఇక నో చాన్స్

రాజ్యసభలో మరో వివాదాస్పద బిల్లు ... ఇక నో చాన్స్

కేంద్ర ప్రభుత్వం మరో వివాదాస్పద బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగిస్తూ  కొత్త బిల్లును తీసుకొచ్చింది. ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీ)  ( నియామకాలు, సర్వీసుల కండీషన్లు, పదవీకాలం) బిల్లు, 2023 ప్రకారం నియామక ప్యానెల్‌లో సీజేఐని తొలగించింది. ఎన్నికల సంఘంలో నియామకాలను త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమించాలని ఇందులో ప్రతిపాదించారు. అయితే, ఈ ప్యానెల్‌లో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్షనేత, ప్రధాని నామినేట్‌ చేసిన కేంద్ర కేబినెట్‌ మంత్రి ఒకరు సభ్యులుగా ఉండనున్నారు. ఈ ప్యానెల్‌కు ప్రధాని నేతృత్వం వహిస్తారని కొత్త ప్రతిపాదన పేర్కొంటున్నది.  కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఫ్‌ువాల్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. భారత ఎన్నికల  కమిషన్‌లో ముగ్గురు కమిషనర్లు ఉంటారు. వీరిలో ఒకరు  ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు. వీరిని రాజ్యాంగంలోని అధికరణ 324(2) ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :