బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ భద్రతలో భారీ వైఫల్యం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. సీఎం తన ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో కొందరు వ్యక్తులు బైక్పై ఆయనకు అత్యంత సమీపానికి వచ్చారు. ముఖ్యమంత్రి భద్రతా వలయాన్ని చేధించుకుని దాదాపు ఆయనను ఢీకొట్టినంత పని చేశారు. అప్రమత్తమైన నీతీశ్ వెంటనే పుట్పాతపైకి దూకారు. సీఎం వార్నింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం ముఖ్యమంత్రి నీతిశ్ వాకింగ్ చేసేందుకు తన ఇంటి నుంచి సర్క్యూలర్ రోడ్డుకు వెళ్లారు. దీంతో మార్గంలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు రెండు బైక్లపై ఆ మార్గంలోకి వచ్చారు. భద్రత వలయాన్ని దాటుకుని సీఎం నడుస్తున్న వైపు వేగంగా దూసుకొచ్చారు. వీరిని గమనించిన నీతిశ్ వెంటనే అప్రమత్తమై రోడ్డు పక్కనే ఉన్న ఫుట్పాత్పైకి దూకారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే భద్రత సిబ్బంది బైకర్లను వెంబడిరచి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనాస్థలంలో సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇది పొరబాటున జరిగిందా లేదా దీని వెనుక ఇంకేదైనా ఉద్దేశం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.