ఈ నెల 25 నుంచి బతుకమ్మ సంబురాలు
ఈ నెల 25 నుంచి అక్టోబర్ 3 వరకు కొనసాగే బతుకమ్మ సంబురాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిచిందని తెలిపారు. బతుకమ్మ ఏర్పాట్లపూ బీఆర్కేభవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 3 న నిర్వహించే సద్దుల బతుకమ్మకు హైదరాబాద్ ట్యాంక్బండ్ను ముస్తాబు చేయాలని సూచించారు. బతుకమ్మ ఘాట్తో పాటు ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని, విద్యుద్దీపాలతో అలకరించాలని ఆదేశించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఎన్బీ స్టేడియంతో పాటు హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని సూచించారు.