ప్రముఖ ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషికి బ్రిటన్ రాయల్ గోల్డ్ మెడల్
భారత్కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ (భవన నిర్మాణ శిల్పి) బాలకృష్ణ దోషికి బ్రిటన్కు చెందిన ప్రతిష్ఠాత్మకమైన రాయల్ గోల్డ్ మెడల్ 2022 పురస్కారం లభించింది. ఈ మేరకు రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ (ఆర్ఐబీఏ) ప్రకటించింది. 94 ఏళ్ల దోషి, తన 70 ఏళ్ల కెరీర్లో వందకు పైగా ప్రాజెక్టులు నిర్మించారని, భారత్లో, సమీప ప్రాంతాల్లో ఆర్కిటెక్చర్ దిశగా బోధన, అభ్యసనపై గొప్ప ప్రభావితం చూపారని ఆర్ఐబీఏ పేర్కొంది. ఆర్కిటెక్చర్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాతకమైన పురస్కారాల్లో రాయల్ గోల్డ్ మెడల్ ఒకటి. ఆ రంగంలో గొప్ప ప్రభావాన్ని చూపిన వ్యక్తులకు, బృందాలకు ఈ పురస్కారాన్ని అందచేస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దోషితో స్వయంగా మాట్లాడి అభినందించినట్లు తెలిపారు.
Tags :