టీఆర్ఎస్ శాఖలు ఎన్నారైలకు అండగా ఉండాలి
విదేశాల్లో ఉంటున్న మన వారికి టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు అండగా నిలవాలని, ఇబ్బందులేవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తనను కలిసి టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డితో కేటీఆర్ పలు అంశాలపై చర్చించారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న అబద్ధపు ప్రచారాల గురించి ప్రస్తావిస్తూ ఎన్నారైలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు.
Tags :