ఏపీ విద్యార్థికి జాక్పాట్ .. రూ.1.45 కోట్ల ప్యాకేజీతో
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి శివశంకర్రెడ్డి ఫ్లిప్కార్ట్ లో జాక్పాట్ కొట్టేశాడు. ముంబై ఐఐటీలో తృతీయ సంవత్సరం చదువుతున్న శివశంకర్ రెడ్డి క్యాంపస్ సెలక్షన్స్ లో రూ.1.45 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఫ్లిప్కార్ట్ లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రొద్దుటూరులోని రామేశ్వరానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ సుబ్బారెడ్డి కుమారుడు శివశంకర్ రెడ్డి పదో తరగతి వరకు ప్రొద్దుటూరులోని శ్రీ చైతన్య స్కూల్; ఇంటర్ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో చదివాడు. అనంతరం ముంబై ఐఐటీలో సీటు సాధించి అక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ప్రొద్దుటూరుకు వచ్చిన శివశంకర్ తాను చదివిన శ్రీచైతన్య పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను కలిశాడు. ఈ సందర్భంగా విద్యార్థిని రీజనల్ ఇన్చార్జ్ నాగిరెడ్డి ఘనంగా సత్కరించారు.
Tags :