జబర్దస్త్ మానేయడానికి కారణమిదే!
జబర్దస్త్ వల్ల ఎంతో మంది సెలబ్రిటీలుగా మారారు. అందులోని కొందరు కమెడియన్స్ అయితే వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ బిజీగా అయ్యారు. ఇండస్ట్రీలో తమకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నారు. కేవలం కమెడియన్స్ కే కాదు, ఈ షో వల్ల యాంకర్లు కూడా చాలా క్రేజ్ తెచ్చుకున్నారు. అనసూయ, రష్మి లాంటి వారు ఆడియన్స్ కు బాగా దగ్గరవడంతో పాటూ, కేవలం ఈ షో వల్ల వాళ్లు కెరీర్లో బాగా సెటిల్ కూడా అయ్యారు.
రీసెంట్గా అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఉన్నంత వరకు ఆ షో గురించి ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయని అనసూయ, బయటకు వచ్చాక తన బాడీ గురించి చాలాసార్లు స్కిట్లలో తప్పుగా మాట్లాడారని చెప్పింది అనసూయ. అయితే ఇప్పుడు కొత్తగా ఆ ఇద్దరి వల్లే షో మానేశా అంటుంది. ఎవరా ఇద్దరు అంటే వారిద్దరూ అనసూయ కొడుకులని తెలుస్తుంది.
తన కొడుకులకు ఇబ్బంది అవుతుందనే కారణంతోనే జబర్దస్త్ ను మానేశానని అనసూయ లేటెస్ట్ గా చెప్పుకొచ్చింది. ఓ పక్క సినిమాల షూటింగ్స్, మరో పక్క జబర్దస్త్, పిల్లలకు టైం ఇవ్వలేకపోతున్నాననిపించి, ఆ షో కు గుడ్ బై చెప్పానని చెప్పింది అనసూయ. గత ఎనిమిదేళ్లుగా జబర్దస్త్ తనకు మంచి కెరీర్ ఇచ్చిందని, ఇప్పుడు సినిమాల్లో బిజీ అవడం వల్ల ఆ షో చేయడం కుదరట్లేదని చెప్పుకొచ్చింది అనూ.
మొదట్లో బాడీ షేమింగ్ వల్ల షోకు గుడ్ బై చెప్పానని చెప్పిన అనసూయ ఇప్పుడు పిల్లల కోసం షో వదిలేశానని చెప్పడం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. చేతి నిండా సినిమాలతో అనసూయ కెరీర్ ఫుల్ బిజీ అయింది. క్యారెక్టర్ సెలక్షన్లో కూడా అనసూయ తన స్పెషాలిటీ చూపిస్తుంది.