బన్నీ, త్రివిక్రమ్.. ఓ పాన్ ఇండియా మూవీ
త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కుతుంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు రాగా, ఆ రెండు సినిమాలు కమర్షియల్గా సక్సెస్ కాలేదు కానీ ఆ రెండు సినిమాల్లో త్రివిక్రమ్, మహేష్ను చాలా కొత్తగా చూపించాడు. ఇప్పుడు మహేష్28లో కూడా మహేష్ను ఊర మాస్ క్యారెక్టర్లో చూపించనున్నాడట త్రివిక్రమ్.
రీసెంట్గా మొదటి షెడ్యూల్ మొదలుపెట్టి వారంలోనే దాన్ని కంప్లీట్ చేశారు. ఈ వారంలో మరో కీలక షెడ్యూల్ మొదలయ్యే అవకాశాలున్నాయి. వీలైనంత త్వరగా ఈ సినిమాను కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. మరో వైపు మహేష్ కూడా ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా కోసం కసరత్తులు చేయాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ చేస్తూనే త్రివిక్రమ్ మరోవైపు తన తర్వాతి ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలను కూడా సాగిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ బన్నీతో సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే చాలా వార్తలు ఫిల్మ్ నగర్ లో కోడై కూస్తున్నాయి.
బన్నీతో త్రివిక్రమ్ చేసే సినిమాకు సంబంధించిన ఫైనల్ కథను ఇప్పటికే బన్నీకి తివిక్రమ్ వినిపించిటనట్లుగా తెలుస్తోంది. బన్నీకి ఈ స్టోరీ విపరీతంగా నచ్చడంతో ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో చేయాలనే ఆలోచనతో ఉన్నాడట. పుష్ప తర్వాత బన్నీ రేంజ్ చాలా పెరిగిపోయింది. దీంతో బన్నీ ఆలోచన మొత్తం పాన్ ఇండియా స్టోరీలపైనే ఉంది. అందుకే ఇంతకుముందు బన్నీ కమిట్ అయిన సినిమాలను కూడా కావాలనే హోల్డ్లో పెట్టాడు. కానీ త్రివిక్రమ్ మాత్రం కేవలం స్టోరీనే రెడీ చేసుకున్నాడనీ, పాన్ ఇండియా ఆలోచన త్రివిక్రమ్ది కాదని, బన్నీతో మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఓకే కావొచ్చంటున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చే వేసవి తర్వాత మొదలయ్యే అవకాశాలున్నాయి.