మరకతమణి సీక్వెల్ కి రెడీ అంటున్న ఆది పినిశెట్టి...
కోలీవుడ్ యంగ్ హీరో ఆదిపినిశెట్టి హీరోగా నటిస్తూనే విలన్ పాత్రల్లోనూ నటిస్తూ మెప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక వైవిథ్యమైన కథాబలం ఉన్న చిత్రాలు చేయడం ఆది ప్రత్యేకత.యంగ్ డైరెక్టర్స్ ఐడియాల్ని ప్రోత్సహించడంలో ఈ స్టార్ ముందుంటాడు. ఇప్పటికే అలాంటి వారిని దర్శకులుగా పరిచయం చేసాడు. ఆ రకంగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఆదికి మంచి పేరుంది.
రీసెంట్ గా 'వైశాలి' చిత్రాన్ని తెరకెక్కించిన అరివళగన్ తో 13 ఏళ్ల తర్వాత చేతులు కలిపారు ఆది . ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్ లో 'శబ్దం' అనే సినిమా తెరకెక్కుతుంది. శబ్దం ఒక థ్రిల్లర్ హార్రర్ మూవీ. ఆది పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సినిమాకి సంబంధించిన గ్రిప్పింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. అలాగే ఇంకోవైపు తాజాగా మరో హిట్ సినిమాకి సీక్వెల్ చేయడానికి కూడా ఆది రెడీగా ఉన్నట్లు తెలిపారు.
ఆది అభిమాని ఒకరు మరకతమణి కి సీక్వెల్ చేయమని అడిగారట. దీనికి ఆయన ప్రతిస్పందిస్తూ, నేను కూడా ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి వెయిట్ చేస్తున్నాని చెప్పారు. దీంతో హిట్ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేయాలా? లేదా? అన్నది దర్శకుల నిర్ణయంగా తెలుస్తోంది.సీక్వెల్ కథ రెడీ చేస్తే నటించడానికి ఆది రెడీగా ఉన్నట్లు ప్రకటించేసారు. మరి దీనిపై మేకర్స్ ఏమంటారో చూడాలి. మరకతమణికి ఆర్క్ శరవణ్ దర్శకత్వం వహించారు. ఇది హారర్ కామెడీ చిత్రం. ఇందులో ఆదికి జోడీగా నిక్కీ గల్రానీ నటించింది అన్ని విషయం తెలిసిందే.