మల్కాజిగిరిలో అత్యధికం.. ఆదిలాబాద్ లో అత్యల్పం
త్వరలో జరగనున్న లోక్సభ నేపథ్యంలో తెలంగాణలో అత్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. 17 లోక్సభ స్థానాలకు గానూ వివిధ రాజకీయ పార్టీల నుంచి మొత్తం 895 మంది అభ్యర్థులు, 1,488 నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా మల్కాజిరిగిలో 114 మంది 177 నామినేషన్లు వేశారు. అత్యల్పంగా ఆదిలాబాద్లో 23 మంది అభ్యర్థులు 42 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కొత్తగా 24 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్లు 50కి చేరాయి.
Tags :