కరోనా మహమ్మారితో వణికిపోతున్న అగ్రరాజ్యం ..
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వణికిస్తోంది. మహమ్మారి ఆ దేశంలో మరణమృదంగం మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 3,900కి పైగా మరణాలు నమోదు కావడమే అందుకు నిదర్శనం. మనదేశంలో ఒక్కరోజులో 299 మృతువాతపడగా.. అమెరికాలో అది 13 రెట్లు అధికం కావడం గమనార్హం. తాజాగా జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఈ వైరస్ గణాంకాలను వెల్లడించింది. అమెరికా కాలమానం ప్రకారం గడిచిన 24 గంటల్లో 3,927 మంది కొవిడ్-19 కారణంగా మృత్యు ఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 3,41,845కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,89,671 మందికి వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య రెండు కోట్లకు చేరువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Tags :