పీసీసీ అధ్యక్షుడు కీలక నిర్ణయం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ పీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొద్దిరోజుల్లో పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్లు ప్రకటించారు. హుజూర్నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీసీసీ బాధ్యతలతో సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించ లేకపోతున్నానని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఆ తర్వాత నుంచి హుజూర్నగర్, కోదాడ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఉత్తమ్ సృష్టం చేశారు.
Tags :