జయరాంను కలిసిన ఎమ్మెల్యే స్వామిదాస్
ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంను కృష్ణా జిల్లా తిరువూరు శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్ శుక్రవారం సాయంత్రం మిల్పిటాస్లోని స్వాగత్ హోటల్లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఏపీ జన్మభూమి ద్వారా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను స్వామిదాస్ ప్రశంసించారు. ఈ సందర్భంగా స్వామిదాస్ను జయరామ్ కోమటి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారై టీడిపి అభిమానులు పాల్గొన్నారు.
Tags :