కేసీఆర్ తర్వాత కేటీఆరే : కవిత
తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత కేటీఆరే ముఖ్యమంత్రి అవుతారని మనుకోట ఎంపీ మాలోతు కవిత అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని ముందుకు తీసుకెళ్తూనే ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ గ్రీన్ చాలెంజ్ను స్వీకరించిన ఎంపీ మహబూబాబాద్లో మూడు మొక్కలు నాటారు. అనంతరం తన పార్లమెంట్ పరిధిలోని నర్సంపేట, డోర్నకల్, పినపాక ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, రెడ్యానాయక్, రేగ కాంతారావులకు ఆమె గ్రీన్ చాలెంజ్ విసిరారు.
Tags :