రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు : కళా వెంకట్రావు
నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలకు ఎన్నో సుఖ, సంతోషాలను తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కిమిడి కళావెంకట్రావు ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షాలు తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెం.1 స్థానంలో ఉందని, భవిష్యత్లోనూ ఈ పరంపరను కొనసాగిస్తామని ఆకాంక్షించారు. 2018 ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని, విజయాలను చేకూర్చాలని కోరుకున్నారు.
Tags :