తాను చనిపోయి తొమ్మిది మందిని బతికించింది
అమెరికాలోని మిచిగన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్డెడ్ అయిన హైదరాబాద్కు చెందిన చరితారెడ్డి (25) మృతి చెందారు. మిచిగన్ లోని లాన్సింగ్లో నివాసం ఉంటున్న చరితారెడ్డి గత నెల 27న కారు ప్రమాదంలో బ్రెయిన్డెడ్కు గురవగా మరో ముగ్గురు కూడా గాయపడ్డ విషయం తెలిసిందే. కారులో వెనక సీటల్లో కూర్చున్న చరితారెడ్డి తీవ్రంగా గాయపడి బ్రెయిన్డెడ్కు గురైంది. వెంటనే ఆమెను ముస్కేగాన్ అస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బ్రెయిన్డెడ్ అయిందని తెలిపారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే చరితారెడ్డి కుటుంబసభ్యులు మిచిగాన్కు వెళ్లారు. చరితారెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్కు తీసుకు వచ్చేందుకు ప్రవాసీయులు దాదాపు 50 వేల డాలర్ల సహాయాన్ని అందించారు.
చరితారెడ్డి మృతి చెందినా తొమ్మిది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. మిచిగన్లోని యూనివర్సిటీలో చేరిన సమయంలోనే చరితారెడ్డి తన అవయవాలను దానం చేశారు. దీంతో ఆమె మృతి చెందిన వెంటనే అక్కడి వైద్యులు ఆమె శరీరంలోని కిడ్నీలు, లివర్, హార్ట్వేవ్స్, కళ్లు తీసి అవసరం ఉన్న వారికి అందించారు. ఈ విషయాన్ని అక్కడి వైద్యులు అధికారికంగా ప్రకటించారు.