అందుకే ఈ నిర్ణయం... రాజధాని రైతులు
రాజధాని ప్రాంతంలో రైతులు, ప్రజలు మలిదశ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి (జనవరి 3వ తేదీ) సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. 16 రోజులుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాజధాని పరిధిలోని అన్ని గ్రామల్లో ఆందోళనకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే రెండో దశ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని రైతులు సృష్టం చేశారు. ఆస్పత్రులు, మందుల దుకాణాలు, పాల సరఫరా తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు నిలిపివేస్తామన్నారు.
Tags :