ASBL NSL Infratech

చైనాను దాటేసిన ఇండియా

చైనాను దాటేసిన ఇండియా

నూతన సంవత్సరం తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది జన్మించారని, ఇందులో అత్యధికులు ఇండియాలోనే పుట్టారని యునిసెఫ్‌ వెల్లడించింది. మొత్తం 3,92,078 జనవరి 1న జన్మించారని, అందులో 67,385 మంది ఇండియాలో పుట్టారని పేర్కొంది. జననాల విషయంలో అత్యధికంగా జనాభా ఉన్న చైనాను భారత్‌ అధిగమించిందని, చైనాలో న్యూ ఇయర్‌ ఫస్ట్‌ డేన 46,299 మంది పుట్టారని పేర్కొంది.

పీజీలో 2020 సంవత్సరపు తొలి బేబీ జన్మించిందని వెల్లడించిన యునిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్రిట్టా ఫోరే, మొత్తం జననాల్లో సగం మంది ఎనిమిది దేశాల్లోనే పుట్టారని వెల్లడించారు. ఇండియా, చైనాలతో పాటు నైజీరియా (26,039), పాకిస్థాన్‌ (16,787), ఇండోనేషియా (13,020), యూఎస్‌ఏ(10,452) డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (10,247) ఇథియోపియా (8,493) జననాలను చూశాయని తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :