Bandi Sanjay : బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా.. మన మోదీ కానుక

కేంద్ర ప్రభుత్వం విద్య కోసం రూ.1.28 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్రమంతి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా మన మోదీ (Modi) కానుక పేరుతో కరీంనగర్ (Karimnagar) పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు 20 వేల సైకిళ్ల (Bicycles) పంపినీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తలచుకుంటే అద్భుతాలు చేయగలరు. తలదించుకుని పుస్తకాలు చదివితే భవిష్యత్లో తలెత్తుకుని జీవిస్తాం. సైకిళ్ల పంపిణీ కార్యక్రమం పూర్తయిన తర్వాత త్వరలోనే మోదీ కిట్లు (Modi kits) కూడా పంపిణీ చేస్తాం అని తెలిపారు.