Chandrababu: దేశానికి గేట్వేలా ఆంధ్రప్రదేశ్ మారుతోంది : చంద్రబాబు
దేశంలోనే అందమైన నగరంగా విశాఖకు పేరుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. ఈ సదస్సుకు 72 దేశాల ప్రతినిధులు వచ్చారన్నారు. విశాఖ (Visakhapatnam)ను సురక్షితమైన నగరంగా కేంద్రం ఇటీవల ప్రకటించింది. దేశానికి గేట్వేలా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మారుతోంది. పెట్టుబడిదారుల లక్ష్యంగా మన రాష్ట్రం ఎదుగుతోంది. ప్రధాని మోదీ (Prime Minister Modi) పరిపాలనపై దేశ ప్రజలకు విశ్వాసం ఉంది. 2047 లోగా మనదేశం నంబర్ వన్ ఎకానమీ అవుతుంది. ప్రజలు, వనరులు, సాంకేతికతను సమర్థంగా వాడుకుంటే తిరుగులేదు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసే పరిస్థితి వచ్చింది. పేదరికం, అసమానతలు రూపుమాపేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. గ్రీన్ఎనర్జీ వినియోగం, స్వచ్ఛాంధ్ర దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఐటీలో మనవాళ్లే ముందుంటున్నారు. ఏపీకి స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వస్తున్నాయి. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీలో మన రాష్ట్రమే ముందుంది. ఏపీకి అనేక కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తున్నాం అని అన్నారు.






