ASBL NSL Infratech

17వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

17వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

కర్నూలు జిల్లా వెల్దుర్తి : వైయస్  జగన్‌  ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి నుంచి ప్రారంభంకానుంది. 
అక్కడి నుంచి వెల్దుర్తి, చెరుకులపాడు, పుట్లూరు క్రాస్‌, తొగరచేడు క్రాస్‌ వద్దకు చేరుకుంటారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ శ్రీ  వైయస్ జగన్‌ ముందుకు సాగనున్నారు. భోజన విరామం అనంతరం కృష్ణగిరి నుంచి పాదయాత్ర పున:ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి 6.30గంటలకు రామకృష్ణ పురం చేరుకుంటారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత శ్రీ వైయస్ జగన్ 16 రోజుల్లో 225.6 కిలోమీటర్లు నడిచారు‌.

కర్నూలు జిల్లా -- చెరుకులపాడు చేరుకున్న వైయస్ జగన్..

వైయస్ జగన్ కు ఘనస్వాగతం పలికిన గ్రామస్ధులు.. వైయస్ జగన్ రాకతో భారీగా తరలివచ్చిన జనం.. వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర కు బ్రహ్మరధం.. అడుగడుగునా వైయస్ జగన్ కు జననీరాజనాలు.. అన్న వస్తున్నాడు అంటూ శ్రీవైయస్ జగన్ కు జనం జేజేలు.. దారిపోడవునా తమ సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలు..

వైయస్ జగన్ ను కలిసిన ముస్లిం సోదరులు..

వైయస్ జగన్ వద్ద తమ గోడు చెప్పుకున్న ముస్లింలు.. మౌజమ్ పేష్మామ్, ఇమామ్ లకు ఇచ్చిన హామీని విస్మరించారని ఆవేదన.. జీతాలు ఇస్తామని చెప్పి తమ గురించి పట్టించుకోవడం లేదన్న ముస్లింలు..

కర్నూలు జిల్లా వెల్దుర్తి లో వైయస్ జగన్ ను కలిసిన మహిళలు..

వైయస్ జగన్ వద్ద తమ సమస్యలు చెప్పుకున్న మహిళలు.. బ్యాంకు రుణాల గురించి అడిగి తెలుసుకున్న శ్రీ వైయస్ జగన్..

Click here for Photo Gallery

 

Tags :