ASBL NSL Infratech

బన్నీ పై నర్మగర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసిన నాగబాబు..

బన్నీ పై నర్మగర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసిన నాగబాబు..

ఏపీ ఎన్నికల నేపథ్యంలో మెగా ఫ్యామిలీలో సరికొత్త చిచ్చు రాజుకుంది. గతంలో కూడా గొడవలు ఉన్నాయి కానీ ఈసారి మాత్రం అవి ఎంతో స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా బయటకు వస్తున్నాయి. అల్లు వారి కుటుంబం, మెగా వారి కుటుంబం ఎప్పుడూ ఒకే కాంపౌండ్ లో కనిపిస్తారు. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఈ రెండు కుటుంబాల మధ్య పొలిటికల్ గొడవలు ప్రారంభమైనట్లు ఉన్నాయి. అల్లు అర్జున్ తన స్నేహితుడు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా వెళ్లడంతో అసలు ఈ గొడవలు మొదలైనట్లు కనిపిస్తోంది. నిన్న నాగబాబు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని మరింత రెచ్చగొట్టే విధంగా ట్వీట్ పెట్టారు. బన్నీ పేరు ఎత్తకుండానే.. ఘాటుగా నాగబాబు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

"మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే...!" అంటూ నాగబాబు పెట్టిన ట్వీట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించింది అని అందరూ అనుకుంటున్నారు. కూటమిగా టీడీపీ తో కలిసి పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతున్న నేపథ్యంలో మెగా కుటుంబం మొత్తం అతనికి మద్దతుగా నిలిచింది.  రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పవన్  కోసం పిఠాపురం వచ్చారు. అలాంటి సమయంలో బన్నీ వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల వెళ్ళాడు కానీ పవన్ కోసం పిఠాపురం రాలేకపోయాడు. ఈ విషయంలో మెగా కుటుంబంలో కూడా కాస్త అసంతృప్తి కలిగినప్పటికీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవ్వరు ఏమి మాట్లాడలేదు. అనవసరంగా గొడవలు జరిగితే బన్నీ అభిమానులు కూటమికి మద్దతు తెలియజేయరు అనే ఉద్దేశంతో అందరూ సైలెంట్ గా ఉన్నారు. నిన్న ఓటింగ్ పూర్తయిన తర్వాత నాగబాబు ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ ఉద్దేశించి ఈ ట్వీట్ పెట్టారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :