ASBL NSL Infratech

అమెరికాకు చెందిన మూడు ప్రముఖ సంస్థలు.. తెలంగాణలో

అమెరికాకు చెందిన మూడు ప్రముఖ సంస్థలు.. తెలంగాణలో

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్‌ వేదిక కాబోతోంది. భారీ పెట్టుబడులతో ఆ కంపెనీలు తరలిరానున్నాయి. అమెరికాలో పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులు తమ కేంద్రాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధి గోల్ప్‌ క్రీడాపరికరాల తయారీ సంస్థ కాల్‌అవే గోల్ప్‌, అమెరికా తర్వాత అతి పెద్దదైన డిజిటల్‌ టెక్నాలజీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 300 మందికి ఉపాధి లభించనుంది. అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం క్వాల్కమ్‌ సంస్థ రూ.3,904.55 కోట్లతో ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో వచ్చే అక్టోబరులో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ప్రముఖ విద్యుత్‌ వాహనాల సంస్థ ఫిస్కర్‌ ఐఎన్‌సీ రూ.100 కోట్లతో ఐటీ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా 300 మందికి ఉపాధి కల్పించనుంది. కాల్‌అవే సంస్థ గోల్ఫ్‌ బంతులు, స్టిక్‌, దుస్తులు, ఇతర సామాగ్రిని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. ఈ సంస్థ భారత్‌లో డిజిటెక్‌ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. మంత్రి కేటీఆర్‌ కాలిఫోర్నియా సమీపంలోని కార్ల్స్‌బాద్‌లో ఉన్న కాల్‌అవే ప్రధాన కేంద్రాన్ని సందర్శించారు. సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, ముఖ్య ఆర్థికాధికారి బ్రయన్‌ లించ్‌, సీఐవో సాయికూరపాటిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంలో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం లించ్‌ మాట్లాడారు. గోల్ఫ్‌ లో డేటా అనలిటిక్స్‌, ఐటీ సేవలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాల విస్తరణకు హైదరాబాద్‌లో డిజిటెట్‌ కేంద్రాన్నా ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు.

 

Tags :