అయోమయంలో పవన్ ఫ్యాన్స్
ఏపీలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటినీ పక్కన పెట్టి మరీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తుంది సెప్టెంబర్ ఎప్పుడెప్పుడొస్తుందా అని. దానికి కారణం పవన్, సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కానుండటమే.
అయితే రీసెంట్ గా రిలీజైన వీరమల్లు టీజర్ లో కూడా పార్ట్1 2024లోనే వస్తుందని అనౌన్స్ చేయడం అయోమయానికి దారి తీసింది. 3 నెలల గ్యాప్ లో పవన్ నుంచి రెండు సినిమాలు రావడం దాదాపు అసాధ్యమే. బిజినెస్ పరంగా కూడా ఇది సేఫ్ కాదు. అయితే ఓజీకి మరో నెల రోజులు కాల్షీట్స్ ఇవ్వాలి. ఒకవేళ ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తే పవన్ వెంటనే సినిమాల్లోకి రావడం కుదరదు.
ఎంతలేదన్నా మరో రెండు నెలలు లేటయ్యే ఛాన్సుంది. అదే జరిగితే ఓజీ టార్గెట్ రీచ్ అవడం జరగదు. కాబట్టి హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ ను పూర్తి చేసి డిసెంబర్ కల్లా సినిమాను రెడీ చేయొచ్చు. సంక్రాంతికి విశ్వంభర ఉంది కాబట్టి ఇదే మంచి డెసిషన్. ప్రాధాన్యత క్రమంలో కూడా వీరమల్లు ముందు రావడమే న్యాయం. కానీ ఫ్యాన్స్ కు మాత్రం ఓజీ విషయంలో చాలా అంచనాలు, ఎగ్జైట్మెంట్ ఉన్నాయి.