ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తానా సభల్లో ఖమ్మం ఎన్నారై మీట్

తానా సభల్లో ఖమ్మం ఎన్నారై మీట్

తానా మహాసభల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఖమ్మం జిల్లా ఎన్నారైల మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమానికి ఎంతోమంది హాజరయ్యారు. ఖమ్మం-భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు చెందిన ఎన్నారైలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు జే తాళ్ళూరి, మధిర శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయకుమార్‌, ప్రముఖ వైద్యులు డా.తాళ్లూరి రాజశేఖర్‌, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖులు మందలపు రవి, తాళ్లూరి పంచాక్షరయ్య, జక్కంపూడి కృష్ణ మూర్తి, నల్లమల వెంకటేశ్వరరావు, తూనుగుంట్ల శిరీష, సునీల్‌ షావిలి, మిమిక్రీ రమేశ్‌, జక్కంపూడి రాము, దొడ్డా రవి, శ్రీధర్‌ తాళ్లూరి, బాబు బయ్యన్‌, కొండబోలు రవి, సుమంత్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మిమిక్రీ రమేశ్‌ అధ్యక్షత వహించిన ఈ సమ్మేళనాన్ని సామినేని రవి, తాళ్లూరి మురళీ తదితరులు సమన్వయపరిచారు. ఖమ్మం జిల్లా అభివ ద్ధిపై, ఆ జిల్లా నుండి అమెరికాకు వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రుల భద్రత, విద్యా, వైద్యపరమైన అంశాలకు ఎన్నారైల తరఫున అందించాల్సిన సహాయ సహకారాలపై వక్తలు ప్రసంగించారు. అతిచిన్న వయస్సులో చదరంగంలో ప్రతిభ కనబరుస్తున్న రఘురామరెడ్డిని ఈ  అభినందించి సత్కరించారు.

Tags :