యార్లగడ్డను సన్మానించిన జే తాళ్ళూరి
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్గా నియమితులైన పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఘనంగా సత్కరించింది. న్యూయార్క్లోని బీంజ్ ఇండియన్ రెస్టారెంట్లో ఇటీవల జరిగిన ఓ సమావేశంలో తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సేవలను కొనియాడుతూ, భాషకు ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పదవి లభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన న్యూయార్క్ తానా టీమ్ను ఆయన అభినందించారు.
Tags :