రూట్ మార్చిన శ్రీ విష్ణు
మొన్నటి వరకు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడిని శ్రీ విష్ణు ఇప్పుడు తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. సామజవరగమన సినిమా ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్ అవడంతో శ్రీ విష్ణు మార్కెట్ బాగా పెరిగింది. ఆ రీజన్ తోనే ఓం భీం బుష్ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. సామజవరగమన స్థాయి సక్సెస్ కాకపోయినా ఓం భీం బుష్ కూడా హిట్టే.
గతంలో కూడా శ్రీ విష్ణు కామెడీ ఎంటర్టైనర్సే ఎక్కువ చేశాడు. అలాంటి శ్రీ విష్ణు ఇప్పుడు మళ్లీ సీరియస్ దారిలోకి వెళ్లనున్నాడు. హుసేన్ షా కిరణ్ దర్శకత్వంలో శ్రీ విష్ణు ఓ క్రైమ్ థ్రిల్లర్ లో నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 60% పూర్తి చేసుకుంది. రెబ్బ మోనికా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఓ నేరానికి సంబంధించిన పరిశోధనలో శ్రీ విష్ణు నిమగ్నమైనట్లు అనౌన్స్మెంట్ టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది.
మొత్తానికి ఈ సినిమా ద్వారా శ్రీ విష్ణు తన రూట్ ను అయితే మారుస్తున్నాడు. ప్రతిసారి ఒకే జానర్ ను నమ్ముకున్నా కష్టమే. ఈ సినిమా కంటే ముందుగానే స్వాగ్ సినిమా రిలీజ్ కానుంది. ఇది కూడా ఎంటర్టైన్మెంట్ మూవీనే. ఇప్పుడిప్పుడే కెరీర్ సరైన గాడిలో పడిందనుకుని సరైన కథలను ఎంచుకుంటున్న శ్రీ విష్ణు కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి మరి.