పవన్ కు షాక్ ఇచ్చి పార్టీ మారుతున్న పితాని..
ఎన్నికల సమీపిస్తున్న ఈ తరుణంలో టికెట్ దొరకని నేతలు పక్క పార్టీకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలామంది పార్టీలు మారారు. ఈ నేపథ్యంలో జనసేన కోనసీమ జిల్లా మమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. 2014 నుంచి 2019 వరకు ఆయన వైసీపీ తరఫున అదే నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా వ్యవహరించారు. అయితే 2019లో వైసీపీ నుంచి టికెట్ రాకపోవడంతో పార్టీ మారారు. జనసేన తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పితాని ఓడిపోవడం జరిగింది. అయితే ఈసారి కూటమితో పొత్తుల కారణంగా జనసేన కొన్ని టికెట్లకు పరిమితం కావలసి వచ్చింది. ఈ నేపథ్యంలో పితాని కు టికెట్టు రాలేదు. దీంతో అతను మళ్ళీ తిరిగి వైసీపీ గూటికి చేరడానికి నిర్ణయించుకున్నట్లు టాక్. ఇప్పటికే జనసేన పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పితాని పవన్ తనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. రామచంద్రపురం సీటుపై ఆశలు పెట్టుకున్న పితాని టికెట్ రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ మారుతున్నారు కానీ అక్కడైనా టికెట్ దక్కుతుందో లేదో అన్న విషయం తెలియాల్సి ఉంది.