బీఎస్పీలో చేరిన మాజీ ఎంపీ మందా జగన్నాథం
లోక్సభ ఎన్నికల వేళ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. రాజస్థాన్లోని ఆళ్వార్లో బీఎస్పీ అధినేత్రి మాయావతిని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ ఆధ్వర్యంలో కలిసి ఆ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన మందా జగన్నాథం ఆ పార్టీ నుంచి ఎంపీ టికెట్ లభించకపోవడంతో బీఎస్పీలో చేరారు. 1996, 1999, 2004లో టీడీపీ తరపున మూడుసార్లు, 2009లో కాంగ్రెస్ నుంచి నాగర్ కర్నూల్ ఎంపీగా గెలుపొందారు.
Tags :