శర్వా తో అనిల్ రావిపూడి చిత్రం?

టాలీవుడ్లో వరుస సక్సెస్లు అదుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈయన విక్టరీ వెంకటేశ్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్లతో ‘ఎఫ్ 3’ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాను పూర్తి చేసిన వెంటనే శర్వానంద్తో ఓ ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నాడట.ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయినట్టు తెలుస్తోంది. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ ‘ఎఫ్ 2’కి సీక్వెల్గా తయారవుతున్న ‘ఎఫ్ 3’ మీద భారీగా అంచనాలున్నాయి. ఆయన నెక్స్ట్ సినిమాను యంగ్ హీరో శర్వానంద్తో చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. అనిల్ రావిపూడితో చేసిన హీరోలందరు మంచి హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం ఓ భారీ హిట్ కోసం వెయుట్ చేస్తున్న శర్వాకి ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే హిట్ పడ్డట్టే అంటున్నారు. వీద్దరి కాంబోకి సంబంధించిన అధికారక ప్రకటన ఎప్పుడు వెలువడనుందో చూడాలి.