ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ షాక్.. రెండు లక్షల ఖాతాలపై
దేశంలో ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ షాకిచ్చారు. భారత్లోని రెండు లక్షల మందికి పైగా యూజర్ల ఖాతాలను ఎక్స్ కార్ప్ బ్లాక్ చేసింది. పిల్లలపై లైంగిక దాడులు, అశ్లీలత, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్ కట్టడిలో భాగంగా మార్చి నెలలో ఏకంగా 2,12,627 ఖాతాలపై నిషేధం విధించినట్లు ప్రకటించింది. ఫ్రిబవరి 26 నుంచి మార్చి 25 వరకు భారతీయ సైబర్ స్పేస్లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేసినందుకు గాను 1,235 ఖాతాలను తొలగించినట్లు తెలిపింది. కొత్త ఐటీ నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నట్లు తన నెలవారీ నివేదికలో పేర్కొంది. మొత్తంగా ఈ రిపోర్టింగ్ సైకిల్లో దేశవ్యాప్తంగా 2,13,862 ఖాతాలపై నిషేదం విధించినట్లు పేర్కొంది.
Tags :