ASBL NSL Infratech

అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం : వాట్సప్

అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం : వాట్సప్

కొత్త ఐటీ నిబంధనలు-2021లోని 4(2) సెక్షన్‌ చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ వాట్సప్‌, ఫేస్‌బుక్‌ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తాజాగా  విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాట్సప్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాధ్యమంలో మెసేజ్‌లను ఉన్న ఎన్‌క్రిప్షన్‌ విధానాన్ని తొలగించాలని చెబితే తాము భారత్‌లో సేవలను నిలిపివేస్తామని వెల్లడించింది. ఐటీ నిబంధనల్లోని 4(2) సెక్షన్‌ వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు, వినియోగదారుల గోప్యత భంగం కలిగిస్తుందని ఆ సంస్థలు ఆరోపించాయి. ముఖ్యంగా సందేశ సృష్టికర్త జాడను బహిర్గతం చేసే ( ట్రేసబిలిటీ) విధానానికి సంబంధించిన నిబంధనను సవరించాలని డిమాండ్‌ చేశాయి. ఈ క్రమంలోనే ఈ సెక్షన్‌ను సవాల్‌ చేస్తూ వాట్సప్‌, ఫేస్‌బుక్‌ సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

దీనిపై ఢిల్లీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాట్సప్‌ తరపున న్యాయవాది మాట్లాడుతూ మమా ప్లాట్‌ఫామ్‌లో సందేశాల భద్రత కోసం ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ విధానాన్ని అవలంభిస్తున్నారు. ఆ గోప్యత హామీ ఉన్నందువల్లే కోట్లాది మంది యూజర్ల దీన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ రూల్‌తో మేం బలవంతంగా ఆ ఎన్‌క్రిప్షన్‌ను బ్రేక్‌ చేయాల్సి ఉంటుంది. అలా చేయాలని మీరు చెబితే మేం భారత్‌ నుంచి వెళ్లిపోతాం అని కోర్టుకు తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :