అరుదైన ఘనత సాధించిన 13 ఏళ్ల బాలుడు!
పదమూడేళ్ల కుర్రాడు అబ్బురపరిచే ప్రతిభతో వహ్యా అనిపించాడు. హైదరాబాద్లోని బోయిన్పల్లికి చెందిన పడకండి విశ్వనాథ్ కార్తికేయ లద్దాఖ్లో గడ్డకట్టే చలిలో ఒక్కొక్కటి ఆరువేల మీటర్లకు పైగా ఎత్తున్న రెండు పర్వత శిఖరాలను అదిరోహించి అరుదైన ఘనత సాధించారు. మార్ఖా లోయలో ఈ రెండు పర్వతాలు ఉన్నాయి. జులై 11న తొలుత 6,270 మీటర్ల ఎత్తులోని కాంగ్ యాట్సే యాత్ర ప్రారంభించాడు. ఏడు రోజుల తర్వాత జులై 18న శిఖరాగ్రానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి క్రాంపాస్ బేస్ పాయింట్ మీదుగా 6,240 మీటర్ల ఎత్తులోని ద్జో జోంగో పర్వతాన్ని జులై 20న అధిరోహించాడు. గడ్డకటే చలిలో ఏకధాటిగా రెండు పర్వతాలను అధిరోహించడం వివేషం.
Tags :