కియారాని కిస్ చేసిన యంగ్ హీరో.. హర్ట్ అయిన సిద్దార్థ్ మల్హోత్రా...
సినీ ఇండస్ట్రీలో ఏ హీరో ఏ హీరోయిన్ తో సన్నిహితంగా ఉంటారో తెలీదు. కలిసి నటించినంత మాత్రాన, దర్శకుడి సూచనలేకుండా ఒక హీరో రీసెంట్ గా హీరోయిన్ ని సెట్స్ లోనే ముద్దుపెట్టుకున్నాడట. ఇక తన ప్రేయసి అనుమతి లేకుండా వేరొక హీరో బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు అని తెలియగానే సదరు ప్రియుడు కి కోపం తారాస్థాయికి చేరుకుందట. ఇంతకీ ఎవరా హీరో? ఏంటా వార్త?
యంగ్ హీరో వరుణ్ ధావన్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కలిసి ఒక మ్యాగజైన్ షూటింగ్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ సమయంలో దర్శకుడి సూచనలు లేకుండా వరుణ్ కియారా బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడట. ఈ తరుణం లో హీరో సిద్దార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ తో గొడవ పడ్డారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే ఈ వార్త విని ఇటు సిద్దార్థ్ మల్హోత్రా కపుల్, అటు వరుణ్ కూడా పడి పడి నవ్వుకున్నారట.
చాలా కాలంగా సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ముంబై పరిశ్రమలో అత్యంత లవ్ లీ పెయిర్ గా వెలిగిపోతున్నారు. ఈ ఇద్దరు కొంత కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ కపుల్ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు నెట్టింట వార్తలు చెక్కర్లు కొట్టాయి. దీనికి ఇరువైపులా కుటుంబాలు ఏర్పాట్లలో నిమగ్నమైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి పెళ్లిపై ఇంకా ఆఫీషియల్ గా క్లారిటీ రాలేదు. ఈ సమయంలో ఇలాంటి ఒక రూమర్ తెరపైకి రావడంతో ఫాన్స్ తెగ కంగారు పడుతున్నారు.