కనెక్టికట్ స్టేట్ లో తానా నాయకులకు సత్కారం
ఏప్రిల్ 20వ తేదీ సాయంత్రం న్యూ ఇంగ్లండ్ ప్రాంతం లోని వెదర్స్ఫీల్డ్ టౌన్ కనెక్టికట్ స్టేట్ లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ కనెక్టికట్ ఉగాది 2024లో భాగంగా, ఎస్పీ చరణ్ మరియు సునీత గారితో విజయవంతమైన మ్యూజికల్ నైట్ ఈవెంట్ నిర్వహించింది, 4 గంటల నాన్ స్టాప్ కార్యక్రమానికి సుమారు 700 మంది హాజరయ్యారు. గాయకులు ఎస్పిబి చరణ్ మరియు సునీత గారు ప్రేక్షకులను తమ పాటలతో అలరించారు. ఆ కార్యక్రమంలో తానా న్యూ ఇంగ్లాండ్ ఆర్విపి, మరియు న్యూ ఇంగ్లాండ్ ప్రాంతం లో ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి తెలుగు స్కూల్ కమిటీ సభ్యుడు కృష్ణ ప్రసాద్ సోంపల్లి మరియు మాజీ తానా కోశాధికారి విశ్వనాథ్ నాయునిపాటి, మాజీ న్యూ ఇంగ్లాండ్ ఆర్విపి ప్రదీప్ గడ్డంను కనెక్టికట్ తెలుగు అసోసియేషన్ కార్యవర్గం వారు సమాజానికి చేసిన సేవకు గాను సత్కరించింది. ఐకమత్యమే బలం, బలమైన సంఘాలకు ఐక్యతే బలం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం అనే సందేశాన్ని సమాజానికి అందించారు.