ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సర్వం సిద్ధం : యోగి ఆదిత్యానాధ్
అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపధ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ అయోధ్యలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. రామాలయ ప్రారంభోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమవుతోందని, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారని యోగి సంతృప్తి వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పర్యవేక్షణ, భద్రత, రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్తో సమన్వయం వంటి విషయాల్లో అధికారులు, మంత్రులు సరైన రీతిలో వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. వేడుక అనంతరం కూడా అయోధ్య రాముడి దర్శనానికి భక్తులకు సకల సదుపాయాలు కల్పించే విషయంలో ట్రస్ట్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అత్యంత వైభోవోపేతంగా, దైవిక కార్యక్రమంగా చరిత్రలో నిలిచేలా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారని, ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయని తెలిపారు.