ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో చిన్నారులు కూడా ఉండటం కలచివేస్తోంది. మాఘ పూర్ణిమ సందర్భంగా కొందరు భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానం చేసేందుకు ట్రాక్టర్‌లో కదర్‌గంజ్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో కస్‌గంజ్‌ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. పలువురు యాత్రికులు గాయపడ్డారు. స్పందించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ప్రకటించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :