సభలో ఆ ఒక్క విషయమే చెప్పాలా? : మంత్రి తలసాని
మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్పై జరిగిన దాడిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న తన కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా దాడులు మంచిది కాదని హితవు పలికారు. మేడ్చల్ నియోజకవర్గంలో జరిగిన రెడ్ల సింహగర్జన సభకు అనుమతులు ఇప్పించి సహకరించిన మల్లారెడ్డిపైనే దాడి చేయడమేంటని ప్రశ్నించారు. వేదికపై మంత్రి అన్ని విషయాలు చెప్పారని తెలిపారు. సభకు వచ్చిన కొందరు రెడ్డి కార్పొరేషన్ కావాలని అడిగారు. సభలో ఆ ఒక్క విషయమే చెప్పాలా? రెడ్డి కార్పొరేషన్ గురించి మాట్లాడాలని అనడం సబబుకాదు. ఓ బాధ్యత గల మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందని అన్నారు. ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం చేసిన అంశాలను వివరించారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. ఈ ఘటనలో ఎవరీనీ ఉపేక్షించం అని హెచ్చరించారు.