ముంబైలో వేడుకగా శ్రీవారి కల్యాణం
మహారాష్ట్రలోని ముంబై నగరంలో శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం వేడుకగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు స్వామికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ టీటీడీ నిర్వహిస్తున్న సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని అభినందించారు. ఎంపీ శ్రీకాంత్ షిండే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఎ.వి. ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు.
Tags :