అమెరికాలో భారత సంతతి బిల్డర్ మోసాలు..
అమెరికాలోని మయామీ కేంద్రంగా స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న రిషీ కపూర్ అనే భారత సంతతి డెవలపర్ కొన్ని కోట్ల డాలర్ల మేర మోసాలకు పాల్పడ్డారని ఆ దేశ సెక్యూరిటీస్ అండ్ ఏక్సైంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఆరోపించింది. కపూర్కు చెందిన లొకేషన్ వెంచర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ, మరో 21 అనుబంద సంస్థలు కలిసి 50 మంది ఇన్వెస్టర్లను 9.3 కోట్ల డాలర్ల మేరకు బురిడీ కొట్టించారని పేర్కొంది. అధిక లాబాలు వస్తాయంటూ వారి నుంచి కాజేసిన సొమ్ములో 50 లక్షల డాలర్లను వెచ్చించి విలాసవంతమన నావను కొన్నారని, ఒక లగ్జరీ కారును లీజుకు తీసుకున్నారని తెలిపింది. మరో 43 లక్షల డాలర్లను జేబులో వెల్లడించింది. కపూర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎస్ఈసీ సన్నద్దమవుతోంది.
Tags :