ఉప్పునీటితో శుభ్రంచేస్తే కొవిడ్ ముప్పుండదు: అమెరికా
కొవిడ్ పరీక్షలో కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత రోజూ రెండుసార్లు నాసికా రంధ్రాలను తేలికపాటి ఉప్పునీటితో శుభ్రం చేసుకుంటే వైరస్ కారణంగా ఆస్పత్రికి చేరాల్సిన అవసరం తగ్గుతుందని తాజా అధ్యయనం వివరించింది. చెంచాడులో సగం వంతున ఉప్పు, వంటసోడా కప్పు వేడినీటిలో కలిపి ఆ మిశ్రమ ద్రావణాన్ని సైనస్ సీసాలో భద్రపర్చుకోవాలని, దీన్ని ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై మంచి ఫలితం ఉంటుందని అధ్యయనం పేర్కొంది. ఈ విధంగా నాసికా రంధ్రాల లోపలి భాగాలకు అదనంగా ఆర్థ్రీకరణ (అదనపు హైడ్రేషన్) చేయడం వల్ల అవి చక్కగా పని చేస్తాయని అమెరికా లోని ఆగస్టా యూనివర్శిటీకి చెందిన ఆమీ బాక్స్టర్ వివరించారు.
Tags :