ASBL NSL Infratech

వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సాయి పల్లవి..

వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సాయి పల్లవి..

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి. చేసినవి కొన్ని సినిమాలే అయినా, ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది ఈ ముద్దుగుమ్మ. ట్రెడిషనల్ దుస్తులకు ప్రాధాన్యత ఇస్తూ, అందం అభినయంతో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ సెట్ చేసుకుంది సాయి పల్లవి. తన సినిమా జర్నీలోని ప్రతి పాత్రకి ఒక స్పెషాలిటీ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

విరాటపర్వం సినిమా తర్వాత తెలుగులో సాయి పల్లవి మరే ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయలేదు. తన అప్ కమింగ్ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య సాయి పల్లవి సినిమాలకి గుడ్ బాయ్ చెప్పి, డాక్టర్ అవ్వాలనే తన డ్రీమ్ కోసం రెడీ అవుతుంది అని నెట్టింట వార్తలు వినిపించాయి. ఒక రకంగా ఆమె అభిమానులకి ఇది చేదు వార్త అనే చెప్పాలి. కానీ, ఈ విషయం పై ఈ హీరోయిన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

సాయి పల్లవి వెబ్ సిరీస్ లో నటించబోతుంది అంటూ రీసెంట్ గా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల శిష్యుడు ఈ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. లేడీ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో లీడ్ రోల్ కోసం సాయి పల్లవి అయితే ప్రెఫెక్ట్ గా సరిపోతుంది అని ఆమెని సంప్రదించారట. ఈ ప్రాజెక్ట్ కోసం సాయి పల్లవేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక ఈ ముద్దుగుమ్మ ఓటీటీలో సైతం తన నటనతో ఆడియన్స్ కి మరింత దగ్గర కానుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :