కుంభమేలా మాదిరిగానే మేడారం జాతరకు కూడా
కుంభమేళా మాదిరిగానే మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాల్సిందే అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మేడారం జాతరకు వెళ్లిన రేవంత్రెడ్డి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజుల మీద పోరాడి స్ఫూర్తిని నింపిన సమ్మక్క-సారలమ్మ జాతర వైపు సీఎం కేసీఆర్ కన్నెత్తి చూడలేదని విమర్శించారు. దక్షిణ కుంభమేళా మేడారం జాతరను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రామేశ్వరరావు నిర్మించిన కృత్రిమ కట్టడాల వద్దకు ప్రధాని, సీఎం వెళ్తారు. సమ్మక్క`సారలమ్మను అవమానించే అధికారం సీఎం, ప్రధానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ములుగు జిల్లాకు సమ్మక్క`సారలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. రూ.200 కోట్లతో శాశ్వత పర్యాటక కేంద్రంగా మేడారాన్ని అభివృద్ధి చేయాలన్నారు.
Tags :