ASBL NSL Infratech

కుంభమేలా మాదిరిగానే మేడారం జాతరకు కూడా

కుంభమేలా మాదిరిగానే మేడారం జాతరకు కూడా

కుంభమేళా మాదిరిగానే మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాల్సిందే అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. మేడారం జాతరకు వెళ్లిన రేవంత్‌రెడ్డి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజుల మీద పోరాడి స్ఫూర్తిని నింపిన సమ్మక్క-సారలమ్మ జాతర వైపు సీఎం కేసీఆర్‌ కన్నెత్తి చూడలేదని విమర్శించారు. దక్షిణ కుంభమేళా మేడారం జాతరను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రామేశ్వరరావు నిర్మించిన కృత్రిమ కట్టడాల వద్దకు ప్రధాని, సీఎం వెళ్తారు.  సమ్మక్క`సారలమ్మను అవమానించే అధికారం సీఎం, ప్రధానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ములుగు జిల్లాకు సమ్మక్క`సారలమ్మ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. రూ.200 కోట్లతో శాశ్వత పర్యాటక కేంద్రంగా మేడారాన్ని అభివృద్ధి చేయాలన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :